తెలంగాణ పత్రికల్లో కర్ణాటక ప్రభుత్వ పథకాల ప్రకటనలు,,,,తక్షణం నిలిపివేయాలని ఈసీ ఆదేశం

byసూర్య | Tue, Nov 28, 2023, 07:17 PM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ.. కర్ణాటక ప్రభుత్వంపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగహం వ్యక్తం చేసింది. తెలంగాణలో ప్రకటనలు ఇవ్వడాన్ని సీఈసీ తీవ్రంగా పరిగణించింది. వెంటనే ప్రకటనలు ఆపివేయాలని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది. ఈ మేరకు కర్ణాటక సీఎస్ కు లేఖ రాసింది. ఎన్నికల సంఘం ఆమోదం లేకుండా ఎన్నికలు జరిగే రాష్ర్టాల్లో ప్రకటనలు ఇచ్చినందుకు కర్ణాటక కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఈసీ సీరియస్‌ అయ్యింది. మంగళవారం సాయంత్రం 5 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. కర్ణాటక సమాచార, పౌరసంబంధాల శాఖ ఇన్‌చార్జి కార్యదర్శిపై ఎందుకు క్రమశిక్షణ చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని తెలిపింది.


తెలంగాణ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. అందులో భాగంగా టీవీ ఛానెళ్లకు, వార్త పత్రిలకు యాడ్స్, నటీనటులతో ప్రత్యేక వీడియోలు చేయించి ప్రచారం చేస్తున్నారు. ఇక ఇటీవల కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరగా.. అక్కడ తాము ఇచ్చిన ఐదు గ్యారంటీలను అమలు చేస్తున్నామని చెబుతూ తెలంగాణలోని వార్త పత్రికల్లో యాడ్స్ ఇచ్చారు. ఈ నెల 24 నుంచి 27 వరకు వరుసగా వివిధ పత్రికల్లో ఇచ్చిన కర్ణాటక ప్రభుత్వ ప్రకటనలు ప్రచురితమయ్యాయి. దీనిపై బీఆర్‌ఎస్‌, బీజేపీ ఈసీకి ఫిర్యాదు చేశాయి. ఈ ఫిర్యాదులపై ఎన్నికల సంఘం సోమవారం స్పందించింది.


ఇది ఎన్నికల నియామవళి ఉల్లంఘన కిందకి వస్తుందని ఈసీ స్పష్టం చేసింది. అక్టోబరు 9న దీనికి సంబంధించిన ఆదేశాలను అన్ని రాష్ర్టాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖ ద్వారా చేరవేసినట్లు వెల్లడించింది. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నంత వరకు తెలంగాణలో ప్రకటనలు జారీ చేయవద్దని కర్ణాటక ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ప్రకటనల కోసం కర్ణాటక ప్రభుత్వం తమ అనుమతి తీసుకోలేదని ఈసీ స్పష్టం చేసింది. ఎన్నికలు లేని రాష్ర్టాలు ఎన్నికలు జరిగే రాష్ర్టాల్లో ప్రకటనలు ఇవ్వాలనుకొంటే ముందుగా ఈసీ అనుమతి తీసుకోవాలని సూచించింది. తెలంగాణలో ప్రకటనల జారీ ఎన్నికల నియమావళి ఉల్లంఘన అవుతుందని కమిషన్ స్పష్టం చేసింది.


Latest News
 

తెలంగాణకు మరోసారి రెయిన్ అలర్ట్.. పలు జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్ Mon, Sep 16, 2024, 10:09 PM
రాజీవ్ గాంధీ లేకపోతే సిద్ధిపేట రైల్వే స్టేషన్‌లో ఛాయ్, సమోస అమ్ముకునేటోనివి: రేవంత్ రెడ్డి Mon, Sep 16, 2024, 10:05 PM
రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ జాతీయ జెండాను ఆవిష్కరించాలన్న ఈటల Mon, Sep 16, 2024, 09:58 PM
హైదరాబాద్‌లో లక్ష గణపతి విగ్రహాల నిమజ్జనం.. ఆమ్రపాలి కీలక సూచనలు Mon, Sep 16, 2024, 09:49 PM
కళ్లుచెదిరిపోయేలా ఖైరతాబాద్ గణేషుడి ఆదాయం. Mon, Sep 16, 2024, 09:45 PM