మేం అధికారంలోకి వస్తే ఆ ఫైల్‌పైనే తొలి సంతకం,,,,సీఎం కేసీఆర్

byసూర్య | Tue, Nov 28, 2023, 08:25 PM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కీలక ఘట్టానికి చేరుకున్నాయి. నేటితో ప్రచార పర్వం ముగియనుండగా.. ఈనెల 30న పోలింగ్ జరగనుంది. అభ్యర్థులు, పార్టీల భవిత్యవం డిసెంబర్ 3న తేలనుంది. అయితే ఈ ఎన్నికల్లో విజయం సాధించాలని అన్ని పార్టీలు ఉవ్విలూరుతున్నాయి. గెలుపే లక్ష్యంగా వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. బీఆర్ఎస్ ద్వారానే సంక్షేమ పాలన సాధ్యమని మరోసారి పట్టం కట్టాలని ఆ పార్టీ నేతలు కోరుతుండగా.. అవినీతి పాలనను అంతమెుందించి తమకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్, బీజేపీలు ప్రజలను కోరుతున్నాయి.


కాంగ్రెస్ ప్రధానంగా ఆరు గ్యారంటీలతో ప్రజల్లోకి వెళ్తుండగా.. బీజేపీ బీసీ ముఖ్యమంత్రి కార్డుతో ఎన్నికల రణంలో దూసుకెళ్తుంది. తాము అధికారంలోకి వస్తే ముందుగా చేసే పనులు ఇవేనంటూ.. ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు అన్ని పార్టీల నేతలు. ఈ నేపథ్యంలో గులాబీ బాస్, సీఎం కేసీఆర్ కూడా కీలక హామీ ఇచ్చారు. హ్యాట్రిక్ సాధించి మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే తాను సంతకం పెట్టే తొలి ఫైల్ ఏదో కేసీఆర్ చెప్పేశారు. బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వస్తే.. అసైన్డ్‌ భూములకు పట్టాలిచ్చే ఫైలుపై తొలి సంతకం చేస్తానని అన్నారు. ఫస్ట్ కేబినెట్ భేటీలోనే ఆ ఫైలుకు ఆమోద ముద్ర వేస్తానని వెల్లడించారు.


సోమవారం షాద్‌నగర్ నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజాశీర్వద బహిరంగ సభలో కేసీఆర్ ఈ హామీ ఇచ్చారు. అసైన్డ్ భూములకు పట్టాలిస్తామని తాము చెబుతుంటే.. కాంగ్రెస్ నాయకులు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాము మళ్లీ అధికారంలోకి వస్తే అసైన్డ్‌ భూములను గుంజుకుంటామని అబద్ధపు ప్రచారం చేస్తున్నారని.. తాము ఎందుకు తీసుకుంటామని ప్రశ్నించారు. గత పదేళ్లలో అసైన్డ్ భూములు ఎక్కడైనా లాక్కున్నామా? అని ప్రశ్నించారు. అసైన్డ్‌ భూములను గుంజుకునుడు కాదని.. ఎన్నికలు అయిపోగానే తొలి క్యాబినెట్‌ భేటీలోనే అసైన్డ్‌ భూములకు పట్టాలిచ్చే ఫైలుపై సంతకం పెడతానని కేసీఆర్ హామీ ఇచ్చారు.


తెలంగాణలో రైతుల సంక్షేమం కోసం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని కేసీఆర్ వ్యాఖ్యనించారు. రైతుకు పెట్టుబడి సాయంగా రైతుబంధు వేస్తున్నామని.. దురదృష్టం కొద్ది రైతు చనిపోతే ఆ కుటుంబానికి రూ.5 లక్షల రైతు బీమా ప‌రిహారం కూడా అందిస్తున్నామని అన్నారు. రైతులు పండించిన పంటను 7,500 కొనుగోలు కేంద్రాలు పెట్టి కొనుగోలు చేస్తున్నామన్నారు. యుద్ధం చేసెటోని చేతుల కత్తి పెడితే లాభం గానీ, ఉత్తమాటలు చెప్పేటోడి చేతుల పెడితే ఏం లాభం ఉండదన్నారు. 24 గంటల ఉచిత కరెంట్ కావాలన్నా.. కొర్రీలు పెట్టుకుండా రైతుబంధు వేయాలన్నా మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలి కేసీఆర్ ప్రజలకు సూచించారు. అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను బంఫర్ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు.


Latest News
 

గణేష్ నిమజ్జనోత్సవంలో అపశృతి.. తండ్రిని కాపాడే ప్రయత్నంలో కూతురు మృతి Wed, Sep 18, 2024, 10:11 PM
21 గ్రామాల మీదుగా,,,,,హైదరాబాద్ సమీపంలో 6 లైన్ గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి Wed, Sep 18, 2024, 10:08 PM
బీజేపీ మహిళా ఎంపీ హీరోయిన్ కంగనా రౌనత్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే దానం నాగేందర్ Wed, Sep 18, 2024, 10:07 PM
తెలంగాణలో మళ్లీ వర్షాలు.. దంచికొట్టనున్న వానలు, నేటి వెదర్ రిపోర్ట్ Wed, Sep 18, 2024, 10:06 PM
నవంబర్ 10 లోగా బీసీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే, ప్రభుత్వంపై పోరాటం తప్పదు : కేటీఆర్ Wed, Sep 18, 2024, 10:02 PM