కూప్పకూలిన నిర్మాణంలో ఉన్న ఇండోర్ స్టేడియం.. ఇద్దరు కార్మికులు మృతి

byసూర్య | Mon, Nov 20, 2023, 08:34 PM

రంగారెడ్డి జిల్లా మెయినాబాద్ మండలం కనకమామిడిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఇండోర్ స్టేడియం కుప్పకూలింది. ఆ ఘనటలో ఇద్దరు కార్మికులు మృతి చెందినట్లు తెలిసింది. ఓ టేబుల్ టెన్నిస్ అకాడమి సంస్థకి చెందిన ఇండోర్ స్టేడియంలో కూలీలు నిర్మాణ పనులు చేస్తుండగా.. ఒక్కసారిగా స్లాబ్ కూలిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో మెుత్తం కూలీలు 14 మంది ఉన్నట్లు తెలిసింది. ఇద్దరు కార్మికులు చనిపోగా.. మిగతా వారిని రక్షించారు. వారిలో పలువురు గాయపడగా.. ఆసుపత్రికి తరలించారు. మృతులు బిహార్‌కు చెందిన బబ్లు, వెస్ట్ బెంగాల్‌కు చెందిన సునీల్‌గా గుర్తించారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పూర్తి స్థాయిలో శిథిలాలను తొలిగించిన తర్వాత మృతుల సంఖ్యపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇవాళ ఉదయం పనిలోకి ఎంత మంది కార్మికులు వచ్చారు. వారిలో ఎందరు సురిక్షితంగా ఉన్నరనే సమాచారాన్ని నిర్మాణ పనులు పర్యవేక్షిస్తున్న వారిని అడిగి తెలుసుకుంటున్నారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు కూడా తెలియాల్సి ఉంది. నిర్మాణంలో నాణ్యత లేకపోవటం కూలిందా ? లేక డిజైన్ లోపమా? అనేది విచారణ తర్వాత తేలాల్సి ఉంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.


Latest News
 

అసెంబ్లీ సమావేశాలు.. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం Sat, Dec 09, 2023, 11:44 AM
నేటి నుంచే మహిళలకు ఉచిత ప్రయాణం Sat, Dec 09, 2023, 11:42 AM
శ్రీధర్ బాబును అభినందించిన రాజ్ ఠాకూర్ Sat, Dec 09, 2023, 11:42 AM
ప్రేమ పేరుతో యువతిని మోసగించిన యువకుడి అరెస్ట్ Sat, Dec 09, 2023, 11:34 AM
కాసేపట్లో ఎమ్మెల్యేలతో కిషన్ రెడ్డి సమావేశం Sat, Dec 09, 2023, 11:21 AM