హైదరాబాద్‌ వాసులకు ముఖ్య గమనిక.. ఎయిర్‌పోర్టుకు క్యాబ్‌లు బంద్

byసూర్య | Mon, Nov 20, 2023, 08:11 PM

హైదరాబాద్‌‌లోని శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు రద్దీ రోజు రోజుకు ఎక్కువవుతోంది. నగరం నుంచి రాకపోకలు సాగించే వారి సంఖ్య పెరుగుతుండటంతో.. ప్రయాణికులు క్యాబ్స్‌ను ఆశ్రయిస్తున్నారు. అయితే... ఎయిర్ పోర్టులో రద్దీ పెరుగుతుండటం వల్ల.. ఫార్మాలిటీస్ పూర్తి చేయటానికి కొంత అదనపు సమయం పడుతున్న నేపథ్యంలో ప్రయాణికులను రిసీవ్ చేసుకోటానికి, లేదా డ్రాప్ చేసేందుకు బుక్ చేసుకున్న క్యాబ్‌లకు వెయిటింగ్ సమయం పెరిగిపోతోంది. దీని వల్ల.. పార్కింగ్ ఛార్టీలు, వెయిటింగ్ ఛార్జీలంటూ క్యాబ్ డ్రైవర్లకు అదనపు ఖర్చులు అవుతున్నాయి. దీంతో.. వాళ్లు బుకింగ్ యాప్‌‌లు ద్వారా చెల్లించే ఛార్టీలు లేదా మాట్లాడుకున్న కిరాయి మొత్తం అనేది ఏమాత్రం సరిపోవట్లేదు. అలాగని ఎక్కువ కిరాయి వసూలు చేద్దామా అంటే.. బుకింగ్ యాప్‌లలో ఛార్టీలు మరీ తక్కువగా ఉండటం ఇప్పుడు డ్రైవర్లకు పెద్ద తలనొప్పిగా మారింది. దీంతో.. క్యాబ్ డ్రైవర్లు.. "లో ఫెయిర్ నో ఎయిర్" పేరుతో క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు.


ఈ క్యాంపెయిన్‌లో భాగంగా ప్రయాణికులను డ్రాప్ చేయడానికి, పికప్ చేసుకునేందుకు క్యాబ్ డ్రైవర్లు నిరాకరిస్తున్నారు. క్యాబ్ లు విమానాశ్రయానికి వెళ్లడానికి, తిరిగి రావడానికి బుకింగ్ యాప్‌లు మరీ తక్కువ ఛార్జీలు ఇస్తుండటానికి.. వ్యతిరేకంగా తమ స్వరాన్ని వినిపిస్తున్నారు. వారికి చెల్లించే ఛార్జీలు ప్రీపెయిడ్ టాక్సీల కంటే తక్కువగా ఉన్నాయని క్యాబ్ యజమానులు తెలిపారు. మరోవైపు ఈ ప్రచారం వల్ల ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఓ ఐటీ ఫ్రొఫేషనల్ తన అనుభవాన్ని మీడియాతో పంచుకున్నారు. తమ విమానాన్ని అందుకునేందుకు క్యాబ్ బుక్ చేసుకొని పికప్ పాయింట్‌కి వెళ్లగా.. అక్కడ చాలా క్యాబ్‌లు అందుబాటులో ఉన్నా.. తనను తీసుకెళ్లేందుకు మాత్రం ఎవరూ ముందుకు రాలేదు. ఏదమైందని అడిగితే.. క్యాబ్ అగ్రిగేటర్‌లకు వ్యతిరేకంగా సమ్మె జరుగుతోందని కొందరు చెప్పినట్టు తెలిపారు. తమకు గిట్టుబాటు అయ్యేలా ఛార్టీలు ఉండాలంటే.. ఇలా చేస్తున్నామని తెలిపారు. బుకింగ్‌ క్యాన్సిల్ చేసి నేరుగా తనకే డబ్బు చెల్లిస్తానని డ్రైవర్‌కు విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు. అయితే... యాప్‌లో చూపించే ఛార్జీ కంటే రూ.500 ఎక్కువ చెల్లించమని తనను అడిగినట్టు వివరించారు.


అయితే.. ఇది నిరసన కాదని, తమకు గిట్టుబాటు ఛార్జీలు చెల్లించకపోవటం వల్లే తాము రైడ్‌లను రిజెక్ట్ చేస్తున్నామని అక్కడి డ్రైవర్లు వివరించారు. 20 నుంచి 25 కిలోమీటర్ల రైడ్ కోసం కేవంల 2 నుంచి 3 వందలు వసూలు చేస్తున్నామని, ఇది మామూలుగా ఇచ్చే నెలవారీ జీతాల కంటే చాలా తక్కువని అన డ్రైవర్లు చెప్తున్నారు. విమానాశ్రయం నుంచి ప్రీపెయిడ్ ట్యాక్సీలకు తెలంగాణ సర్కారు నిర్దేశించిన రేట్లు.. రూ.143 నుంచి రూ.2,139 వరకు ఉన్నాయని పేర్కొన్నారు. క్యాబ్ డ్రైవర్లతో వీలైనత త్వరగా చర్చలు జరిపి.. ఈ ఛార్జీల సమస్యను తొందరగా పరిష్కరించాలని కోరారు.


Latest News
 

గణేష్ నిమజ్జనోత్సవంలో అపశృతి.. తండ్రిని కాపాడే ప్రయత్నంలో కూతురు మృతి Wed, Sep 18, 2024, 10:11 PM
21 గ్రామాల మీదుగా,,,,,హైదరాబాద్ సమీపంలో 6 లైన్ గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి Wed, Sep 18, 2024, 10:08 PM
బీజేపీ మహిళా ఎంపీ హీరోయిన్ కంగనా రౌనత్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే దానం నాగేందర్ Wed, Sep 18, 2024, 10:07 PM
తెలంగాణలో మళ్లీ వర్షాలు.. దంచికొట్టనున్న వానలు, నేటి వెదర్ రిపోర్ట్ Wed, Sep 18, 2024, 10:06 PM
నవంబర్ 10 లోగా బీసీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే, ప్రభుత్వంపై పోరాటం తప్పదు : కేటీఆర్ Wed, Sep 18, 2024, 10:02 PM