byసూర్య | Mon, Nov 20, 2023, 02:38 PM
ఇళ్ళు లేని పేద ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కట్టిస్తామని ఇచ్చిన హామీ మరచిన బీఆర్ఎస్ పార్టీని ఓడించాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పర్ణిక రెడ్డి అన్నారు. సోమవారం నారాయణపేట మండలం బసిరెడ్డి పల్లి గ్రామంలో నిర్వహించిన ప్రచారంలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ దళితులకు మూడెకరాల భూమి, దళితబంధు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేసిందని అన్నారు. నాయకులు పాల్గొన్నారు.