byసూర్య | Mon, Nov 20, 2023, 02:37 PM
కాంగ్రెస్ పార్టీ హామీలను ప్రజలు నమ్మకండని ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి సతీమణి స్వాతి రెడ్డి అన్నారు. సోమవారం నారాయణపేట పట్టణంలోని 8వ వార్డు పరిధిలోని అశోక్ నగర్ లో ఇంటింటి ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు ప్రజలను మోసం చేసేందుకు ప్రకటించిందని, పక్కన ఉన్న కర్ణాటకలో అయిదు గ్యారెంటీలు అమలు కావడం లేదని అన్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ అనసూయ, వార్డు కౌన్సిలర్ శిరీష, నాయకులు పాల్గొన్నారు.