byసూర్య | Tue, Sep 26, 2023, 12:26 PM
హైదరాబాద్లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఖాజాగూడ ఓక్రిడ్జ్ పాఠశాలలో 10వ తరగతి రేయాన్ష్ రెడ్డి ఆన్లైన్ గేమ్స్కు బానిసై చివరకు భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆన్లైన్ గేమ్స్కు బానిస కావడంతో పాటు చదువులో ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు వారు అనుమానిస్తున్నారు.