byసూర్య | Tue, Sep 26, 2023, 12:39 PM
ఉప్పల్ భగాయత్ వద్ద మూసీ పై బ్రిడ్జి నిర్మాణానికి సోమవారం మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అయితే ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సుభాష్రెడ్డి దూరంగా ఉండటంతో పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల సీఎం కేసీఆర్ అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించిన లిస్టులో తన పేరు లేకపోవడంతోనే తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా కేటీఆర్ కార్యక్రమానికి రాకపోవడంతో కేటీఆర్ కు షాక్ ఇచ్చినట్లు అయిందని చర్చించుకుంటున్నారు.