హైదరాబాద్‌ లో విషాదం ...మోమోస్‌ తిని ఓ మహిళ మృతి

byసూర్య | Mon, Oct 28, 2024, 02:53 PM

హైదరాబాద్‌ లో విషాదం చోటుచేసుకుంది. బంజారాహిల్స్ నందినగర్ లో మోమోస్‌ తిని ఓ మహిళ మృతి చెందింది. మరో 20 మంది అస్వస్థతకు గురయ్యారు. బాధితులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ఈ ఘటనపై బాధితులు బంజారాహిల్స్‌ పోలీసులను ఆశ్రయించారు.నందినగర్ వారాంతపు సంతలో చికెన్‌ మోమోస్ కొనుగోలు చేసి తిన్న వారికి ఫుడ్ పాయిజన్ అయినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో 20 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. సింగాడికుంటకు చెందిన ఓ వివాహిత మృతి చెందింది. బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమచారం. బాధితులు నగరంలోని పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పలువురి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఈ ఘటనపై పోలీసుల విచారణ చేపట్టారు. వారాంతపు సంతలో మెమోస్ పెట్టారనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.


Latest News
 

డిసెంబర్ 9 కల్లా రెండు లక్షల రుణమాఫీ! Mon, Oct 28, 2024, 03:45 PM
హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు Mon, Oct 28, 2024, 03:37 PM
సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం Mon, Oct 28, 2024, 03:32 PM
హైదరాబాద్‌ లో విషాదం ...మోమోస్‌ తిని ఓ మహిళ మృతి Mon, Oct 28, 2024, 02:53 PM
PAC చైర్మన్ ఎంపికపై కాంగ్రెస్ విధానాన్ని ఎండగట్టిన వేముల ప్రశాంత్ Mon, Oct 28, 2024, 02:29 PM