byసూర్య | Tue, Sep 26, 2023, 12:45 PM
తెలంగాణ ప్రభుత్వంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శలు గుప్పించారు. హిందువులకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. 2014లో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్.. హిందువులపై ఇప్పటికీ దౌర్జన్యం చేస్తోందన్నారు. హుస్సేన్ సాగర్ పొల్యూట్ అయిందంటూ గణేష్ ఉత్సవాలను సజావుగా జరగనివ్వడం లేదని మండిపడ్డారు. పీవోపీ వినాయక విగ్రహాలపై హైకోర్టు నిర్ణయం వెనుక ప్రభుత్వ వైఫల్యం ఉందన్నారు.