byసూర్య | Tue, Sep 26, 2023, 12:49 PM
ద్విచక్ర వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన చెట్టు కు ఢీ కొట్టి వ్యక్తి మృతి చెందిన సంఘటన మునగాల మండలం ఇందిరా నగర్ స్టేజీ వద్ద సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపినకోదాడ మండలం దొరకుంటకు చెందిన వేమా వెంకన్న బంధువుల దశ దిన కర్మలకు వల్లబాపురం వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుని సోదరుడు సైదులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.