byసూర్య | Tue, Sep 26, 2023, 12:51 PM
ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఆర్వి. కర్ణన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలనుంచి అదనపు కలెక్టర్లు హేమంత్ కేశవ్ పాటిల్, జె. శ్రీనివాస్తో కలిసి కలెక్టర్ వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 93 వినతులు వచ్చాయన్నారు.