byసూర్య | Tue, Sep 26, 2023, 12:54 PM
ఎన్నికల నిర్వహణకు ఓటరు జాబితా కీలకమని ఓటర్ జాబితా పరిశీలకురాలు కె. నిర్మల అన్నారు. సోమవారం కలెక్టర్ ఛాంబర్లో జిల్లా ఎన్నికల అధికారి, ఓటర్ నమోదు అధికారులు, సహాయ ఓటర్ నమోదు అధికారులతో ఆమె ప్రత్యేకంగా సమావేశమై మాట్లాడారు. జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో మొత్తం 1, 766 పోలింగ్ స్టేషన్లు, సెప్టెంబర్ 17 నాటికి 14, 02, 718 మంది ఓటర్లు ఉన్నారని కలెక్టర్ ఆర్వి. కర్ణన్ తెలిపారు.