byసూర్య | Tue, Sep 26, 2023, 12:56 PM
నార్కట్ పల్లి మండలం చెరువుగట్టు గ్రామంలోని వినాయక నవరాత్రి ఉత్సవాలలో భాగంగా చెరువుగట్టు గ్రామ సర్పంచ్ మల్గ బాలకృష్ణ దంపతులు ఇంటి వద్ద ఏర్పాటుచేసిన వినాయక కుంకుమార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. వినాయకుని చల్లని దీవెనలు గ్రామ ప్రజలందరిపై ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన మహిళలు అధిక సంఖ్యలో పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.