byసూర్య | Tue, Sep 26, 2023, 12:59 PM
నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణంలోనికి హైదరాబాద్ నుండి వస్తున్న ఆర్టీసీ ఎక్సప్రెస్ బస్సుల రావడం లేదని, దీనివల్ల ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నట్లుగా మంగళవారం ప్రయాణికుడు కందగట్ల సందీప్ ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్ల నిర్మాణం పేరుతో ప్రయాణికులను ఇబ్బంది గురి చేస్తున్నట్లు తెలిపారు. దీని మూలంగా పట్టణానికి దూరంలోని బైపాస్ దిగి నడిచి రావాల్సి వస్తుందన్నారు. ఆర్టీసీ ఉన్నతాధికారులు స్పందించాలని కోరారు.