byసూర్య | Tue, Sep 26, 2023, 12:24 PM
ఉద్యోగ నియామకాల్లో పేపర్ లీకేజీలకు పాల్పడి నిరుద్యోగులతో చలగాటమాడుతున్న టీఎస్పీఎస్సీ కమిటీని రద్దు చేయాలని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు లింగం స్వేరో డిమాండ్ చేశారు. పార్టీ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం కలెక్టరేట్ ను ముట్టడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఎస్పీఎస్సీ కేసుని సీబీఐకి అప్పగించాలని కోరారు. సిట్ విచారణలో చైర్మన్, సభ్యులు, ఎస్ఓ వెంకటలక్ష్మిని నిందితులుగా చేర్చాలని కోరారు.