byసూర్య | Sun, Sep 24, 2023, 11:19 AM
పార్లమెంట్లో ఆమోదించిన మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్రప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు ఆర్. అరుణజ్యోతి డిమాండ్ చేశారు. ఐద్వా రాష్ట్ర కమిటీ ఆధ్వర్యాన చేపట్టిన జీపుజాతా శనివారం ఖమ్మం రూరల్ మండలం ఎం. వెంకటాయపాలెం, తిరుమపాలెంతో పాటు ఖమ్మం నగరంలో కొనసాగింది. ఆమె మాట్లాడుతూ. మణిపూర్ ఘటన నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు కేంద్రం మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకొచ్చిందని ఆరోపించారు.