byసూర్య | Sun, Sep 24, 2023, 11:18 AM
ఒడిశా నుంచి ఏపీకి తరలిస్తున్న 21 కేజీల గంజాయిని కల్లూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కల్లూరులోని షుగర్ ఫ్యాక్టరీ వద్ద శనివారం ఎస్ఐ పి. రఘు ఆధ్వర్యాన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఒడిశాకు చెందిన సుజిత సుర్జ్యా మోటార్ సైకిల్ పై 21 కేజీల గంజాయితో ఏపీలో అమ్మేందుకు వెళ్తుండగా పట్టుకున్నారు. గంజాయి విలువ రూ. 4. 20 లక్షలు, గంజాయితో పాటు మోటార్ సైకిల్ ను సీజ్ చేసి నిందితుడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.