byసూర్య | Sun, Sep 24, 2023, 11:03 AM
జిల్లాలో ఈనెల 27న జరిగే గణేష్ శోభాయాత్ర, నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. ఖమ్మం కలెక్టరేట్ లో సీపీ విష్ణు ఎస్. వారియర్తో కలిసి జిల్లా అధికారులతో సమావేశమైన ఆయన నిమజ్జనానికి చెరువుల వద్ద చేయాల్సిన ఏర్పాట్లు, కల్పించాల్సిన సౌకర్యాలపై సూచనలు చేశారు. ఈసమావేశాల్లో అదనపు కలెక్టర్లు సత్యప్రసాద్, డి. మధుసూదన్ నాయక్, కేఎంసీ కమిషనర్ ఆదర్మ్ సురభి తదితరులు ఉన్నారు.