byసూర్య | Sun, Sep 24, 2023, 10:59 AM
ఓటరు నమోదు, మార్పులు, చేర్పుల కోసం అందిన దరఖాస్తులను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ సూచించారు. కలెక్టరేట్ లో నియోజకవర్గ స్థాయి రిటర్నింగ్ అధికారులతో సమావేశమైన ఆయన మాట్లాడుతూ ఈనెల 19వ తేదీతో దరఖాస్తుల స్వీకరణ పూర్తయిందని, వీటిని త్వరగా పరిశీలించి అర్హులకు ఓటు హక్కు కల్పించాలని చెప్పారు. మిగులు దరఖాస్తుల క్షేత్ర పరిశీలన పూర్తిచేసి త్వరితగతిన పరిష్కరించాలన్నారు.