byసూర్య | Sat, Sep 23, 2023, 03:38 PM
గట్టు మండలంలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ఉప కార్యనిర్వాహక ఇంజనీరింగ్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు పరిపాలన అందించేందుకు ఈ కార్యాలయం అందుబాటులో తీసుకొచ్చామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర వినియోగదారుల ఫోరం చైర్మన్ గట్టు తిమ్మప్ప, జంబు రామన్ గౌడ, ఎంపీపీ విజయ్, వెంకటేష్, రామకృష్ణ రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.