byసూర్య | Sat, Sep 23, 2023, 03:36 PM
నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం అన్నాసాగర్ గ్రామానికి చెందిన బాధిత కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి విడుదలైన రూ. 1. 25లక్షల చెక్కును శనివారం ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డి అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం సహాయనిధి ద్వారా లక్షలాది మంది పేదలు లబ్ధిపొందుతున్నారని అన్నారు. కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.