byసూర్య | Sat, Sep 23, 2023, 03:40 PM
తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యాన తెల్కపల్లిలో వినాయకునికి అంగన్వాడీలు శనివారం వినతిపత్రం అందించారు. నాగర్ కర్నూల్ ప్రాజెక్టు కార్యదర్శి డి చంద్రకళ మాట్లాడుతూ ప్రభుత్వానికి ఎన్నోసార్లు సమస్యలు విన్నవించినా స్పందన లేదన్నారు. కనీస వేతనం లేకుండా పిఆర్సి ఇస్తామనడం విడ్డూరంగా ఉందన్నారు. వసంత, విజయ, శిరీష, రేవతమ్మ, ఇందిరమ్మ, తదితరులు పాల్గొన్నారు.