మలద్వారంలో పైపు పెట్టి గాలి ఎక్కించిన వైనం,,,,బాధితుడి పరిస్థితి విషమం

byసూర్య | Fri, Sep 22, 2023, 05:56 PM

జనాల్లో రోజురోజులు సైకోయిజం పెరిగిపోతోంది. చిన్న చిన్న కారణాలకే తమలో దాగున్న శాడిష్టును బయటకు తీసుకొస్తున్నారు. ఎదుటివాళ్లపై వాళ్లు చూపించే క్రూరత్వానికి.. ఏ సైకో థ్రిల్లర్ సినిమాలు కూడా సరిపోవు అన్న చందంగా ప్రవర్తిస్తున్నారు. అలాంటి ఓ అమానవీయ ఘటనే ఖమ్మం జిల్లాలో జరిగింది. ఆరెంపుల గ్రామ పరిధిలోని ఓ గ్రానైట్ ఫ్యాక్టరీలో అతి దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఫ్యాక్టరీలో పని చేస్తున్న కార్మికుల మధ్య ఏదో విషయంలో ఘర్షణ తలెత్తింది. దీంతో.. తీవ్ర కోపావేశానికి గురైన కార్మికులు.. మరో కార్మికుడి మలద్వారంలో పైప్ పెట్టి గాలి కొట్టారు. దీంతో.. అతని పరిస్థితి విషమంగా మారింది. ప్రస్తుతం అతడు వెంటిలేటర్‌‌పై చికిత్స పొందుతున్నాడు.


గ్రానైట్ ఫ్యాక్టరీలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన కొందరు కార్మికులు పనిచేస్తున్నారు. అయితే.. వీళ్ల మధ్య ఏదో విషయమై.. చిన్నగా వాగ్వాదం జరిగింది. అది కాస్త గొడవగా మారి ఘర్షణకు దారి తీసింది. దీంతో.. ఓ కార్మికుడిపై మిగతా వాళ్లందరూ కోపం పెంచుకున్నారు. కోపోద్రిక్తులైన కార్మికులు.. ఆ కార్మికుడు మలద్వారంలో గ్రానైట్ పాలిషింగ్ ఎయిర్ పైపు పెట్టి గాలి ఎక్కించారు. దీంతో కార్మికుడి పొట్ట గాలితో ఉబ్బిపోయి.. గాలి పీల్చుకునేందుకు కూడా అవస్థ పడ్డాడు. ఈ విషయాన్ని గమనించిన మిగతా కార్మికులు.. అతన్ని వెంటనే ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ వ్యక్తి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్తున్నారు. బాధితున్ని వెంటిలేటర్ మీద ఉందని చికిత్స అందిస్తున్నారు. అయితే.. ఇదే విషయమై పోలీసులను సంప్రదించగా.. తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పుకొచ్చారు. ఫిర్యాదు వస్తే.. చర్యలు తీసుకుంటామని చెప్పుకొచ్చారు.


Latest News
 

దసరా పండక్కి దుమ్మురేపిన ఆర్టీసీ.. కళ్లు చెదిరేలా ఆదాయం Fri, Oct 18, 2024, 10:54 PM
మండల ఉపాధ్యాయులకు పి ఆర్ టి యు సభ్యత్వం అందజేత Fri, Oct 18, 2024, 10:51 PM
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండ Fri, Oct 18, 2024, 10:49 PM
ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు Fri, Oct 18, 2024, 10:45 PM
గ్రామ సభల ద్వారానే ఇందిరమ్మ కమిటీలు వేయాలి Fri, Oct 18, 2024, 10:42 PM