byసూర్య | Fri, Sep 22, 2023, 02:24 PM
స్టేషన్ ఘన్పూర్ అసెంబ్లీ టికెట్ విషయంలో BRS ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మధ్య గత కొంతకాలంగా ఉన్న వివాదం సద్దుమణిగింది. వీరిద్దరి మధ్య మంత్రి కేటీఆర్ సయోధ్య కుదిర్చారు. ప్రగతిభవన్లో మంత్రితో కడియం, రాజయ్య శుక్రవారం భేటీ అయ్యారు. సముచిత స్థానం ఇస్తామని రాజయ్యకు కేటీఆర్ హామీ ఇవ్వడంతో కడియంకు రాజయ్య సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కడియం గెలుపునకు రాజయ్య పనిచేస్తానని చెప్పారు.