byసూర్య | Thu, Sep 21, 2023, 03:46 PM
సీఎం కేసీఆర్పై బీజేపీ ఎంపీ బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. అయన మాట్లాడుతూ... ‘‘సీఎం కేసీఆర్ గారు.. ఇంకెన్నాళ్లీ మోసాలు?, పాలమూరును దత్తత తీసుకుంటానని ప్రకటించి ఆ జిల్లా ప్రజలను మోసం చేశారు. కరీంనగర్ను డల్లాస్, న్యూయర్క్ను చేస్తానని మోసం చేశారు. గజ్వేల్ను నెంబర్ వన్గా అభివృద్ధి చేస్తానని హామీలిచ్చి వాళ్ళను మోసం చేశారు. ఇప్పుడు ఓట్లు దండుకునేందుకు కామారెడ్డి ప్రజలను మోసం చేసేందుకు సిద్దమైయ్యారు. వేములవాడ రాజన్నకు ఏటా రూ.100 కోట్ల చొప్పున రూ.400 కోట్లు ఇస్తానని చెప్పి దేవుడికే శఠ గోపం పెట్టారు. రాజన్న ఆలయానికి నయాపైసా ఇవ్వకుండా రాజన్న పైసలను కామారెడ్డికి టాయించాలని చెప్పడం సిగ్గుచేటు. కామారెడ్డి అభివృద్ధికి నిధులు కేటాయించాలనుకోవడంలో అభ్యంతరం లేదు. మరి మిగిలిన నియోజకవర్గాల ప్రజలు ఏం పాపం చేశారు కేసీఆర్?.’’ అంటూ సంజయ్ ప్రశ్నించారు.