byసూర్య | Thu, Sep 21, 2023, 03:46 PM
ఢిల్లీలో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ నేడు మరోసారి భేటీ కానుంది. నిన్న (బుధవారం) లోక్సభలో మహిళా బిల్లుపై ఓటింగ్ కారణంగా అర్థాంతరంగా సమావేశం నిలిచిపోయింది. నిన్న సుమారు రెండున్నర గంటల పాటు అభ్యర్థులపై కసరత్తు చేశారు. గురువారం పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాత స్క్రీనింగ్ కమిటీ సమావేశం కానుంది. ఈ రోజు సమావేశంతో అభ్యర్థుల ఎంపిక కసరత్తు ఓ కొలిక్కిరానుంది. ఇప్పటికే సర్వే నివేదికలను తెప్పించుకున్న స్క్రీనింగ్ కమిటీ.. వడపోత అనంతరం తమ నివేదికను పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీకి సిపారసు చేయనుంది.