byసూర్య | Thu, Sep 21, 2023, 03:45 PM
నిజామాబాద్ జిల్లా, సిరికొండలో గత కొంత కాలంగా రేషన్ బియ్యం దందా చేస్తున్న ఆన్సర్, రహీం అనే వ్యక్తుల మధ్య వివాదం జరిగింది. తనకు 22 లక్షల రూపాయలు ఇవ్వాల్సి ఉందని రహీంతో ఆన్సర్ గొడవ పడ్డాడు. సెటిల్మెంట్ కోసం హైదరాబాద్కు చెందిన అసద్ గ్యాంగ్కు ఆన్సర్ సుపారీ ఇచ్చి పిలిపించాడు. ఈ క్రమంలో సిరికొండలో బుధవారం రాత్రి అసద్ గ్యాంగ్కు ఆన్సర్ ఓ ఫంక్షన్ హాల్లో దావత్ ఇచ్చాడు. అయితే భయపడిన ఆన్సర్ ఈ సెటిల్మెంట్ వద్దని వెళ్లిపోవాలని అసద్తో వాగ్వాదానికిదిగాడు. గొడవ పెద్దది కావడంతో సుపారీ ఇచ్చిన ఆన్సర్నే పొడిచి అసద్ గ్యాంగ్ పరారైంది. గాయపడిన ఆన్సర్కు చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని ఓ ప్రవేట్ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని, విచారణ చేసి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.