byసూర్య | Thu, Jun 08, 2023, 04:16 PM
రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకే బీటీ రహదారుల నిర్మాణాన్ని చేపడుతున్నామని అలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్. అబ్రహాం పేర్కొన్నారు. గురువారం జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం షాబాద గ్రామం నుంచి చాగాపురం వరకు ఉన్న 12 కిలోమీటర్ల రహదారికి బీటి పనులు చేసేందుకు ఆయన భూమి పూజ చేశారు. పనులను త్వరగా పూర్తిచేసి వినియోగంలోకి తీసుకురావాలని ఆయన సూచించారు. రూ. 1. 05 కోట్లతో పనులను చేపట్టామని ఆయన వివరించారు.