byసూర్య | Thu, Jun 08, 2023, 04:03 PM
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రెండు రోజులపాటు ఉరుములు మెరుపులతో, ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని నాగర్ కర్నూల్ జిల్లా పాలెం కృషివిజ్ఞాన కేంద్రం వాతావరణ విభాగం శాస్త్రవేత్తలు గురువారం తెలిపారు. ఇందుకు ఉమ్మడి జిల్లాలోని ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. వర్షం సమయంలో పిడుగులు పడవచ్చని, చెట్ల కిందికి వెళ్లరాదని, కరెంటు పోల్స్ కు కూడా దూరంగా ఉండాలని సూచించారు.