byసూర్య | Thu, Jun 08, 2023, 04:17 PM
జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణంలో బుధవారం అర్ధరాత్రి జరిగిన చోరీపై పోలీసులు స్పందించారు. జిల్లా కేంద్రం నుంచి జాగిలాలను రప్పించి చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. ఆధారాలను సేకరించేందుకు ప్రత్యేకంగా క్లూస్ టీం పట్టణంలో పాగా వేసింది. ఎస్ఐ నరేష్ కుమార్ ఆధ్వర్యంలో ముమ్మరంగా దర్యాప్తు కొనసాగుతుంది. పట్టణంలోని భరత్ నగర్ కాలనీలో ఉంటున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు హరిప్రసాద్ ఇంట్లో జరిగిన చోరీలో 15 తలాల బంగారు ఆభరణాలు, 24 తలాల వెండి, రూ. 50 వేల నగదు ఎత్తుకెళ్లారు.