byసూర్య | Thu, Jun 08, 2023, 01:00 PM
ఖమ్మం జిల్లా మధిర మండల పరిధిలోని పలు గ్రామాలలో గురువారం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు ముమ్మరంగా పర్యటించడం జరిగింది. ముందుగా మండల బిఆర్ఎస్ నాయకులతో ప్రత్యేక సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం మండల పరిధిలోని పలు గ్రామాలలో అర్హులైన లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.