byసూర్య | Thu, Jun 08, 2023, 01:00 PM
జూలూరుపాడు గ్రామపంచాయతీ పరిధిలోని ఈద్గా వద్ద ఎమ్మెల్యే రాములు నాయక్ సహకారంతో బిఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు షేక్ మహబూబ్, మైనారిటీ సెల్ అధ్యక్షుడు షేక్ సుభాని బోరును వేయించారు. గురువారం జరిగిన ఈ కార్యక్రమాన్ని ఎంపీపీ లావుడియా సోనీ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. షేక్ మహబూబ్ మాట్లాడుతూ ఈద్గా వద్ద ముస్లిం సోదరులు వుజూ (ముఖం, చేతులు, కాళ్లు కడిగి నమాజ్ చేసుకునేందుకు ఇబ్బందిగా ఉండటంతో విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకు వెళ్లడం జరిగిందని తెలిపారు. స్పందించిన ఎమ్మెల్యే బోరును వేయించడం జరిగిందని అన్నారు. ముస్లిం సోదరుల సమస్యకు స్పందించి బోరు వేయించిన ఎమ్మెల్యే రాములు నాయక్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి నున్నా రంగారావు, రామిశెట్టి రాంబాబు, మజిద్ కమిటీ అధ్యక్షులు, కమిటీ సభ్యులు ముస్లిం పెద్దలు తదితరులు పాల్గొన్నారు.