byసూర్య | Thu, Jun 08, 2023, 12:55 PM
భారతీయ జనతా యువమోర్చా ములుగు మండల శాఖ నూతన కార్యవర్గ ఎన్నిక సమావేశం ములుగు మండల కేంద్రంలో గల తిరుమల గార్డెన్స్ లో బీజేవైఎం మండల అధ్యక్షులు బీజేవైఎం అధ్యక్షులు మల్యాల స్వామి అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఉపాధ్యక్షులు నలగమ శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి కుడిక్యాల రాములు పాల్గొన్నారు. ఈ నూతన కమిటి లో ప్రధాన కార్యదర్శులు గా కొమ్ము నాగరాజు, దోసకాయల సాయి రామ్. ఉపాధ్యక్షులు గా మహేష్, సుశాంత్, సోషల్ మీడియా కన్వినర్ గా కొమ్ము శేఖర్, కార్యవర్గ సభ్యులు గా భాస్కర్, చంద్ర శేఖర్, నర్సింహా, రవి గౌడ్, కృష్ణ నియమితులయ్యారు. ఈ సందర్భంగా బీజీవైఎం నాయకులు కలిసి మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీని పూర్తిస్థాయిలోకి తీసుకెళ్లడం కోసం బాధ్యత తీసుకున్న ప్రతి ఒక్క కార్యకర్త పార్టీ అభివృద్ధి కోసం కృషి చేయాలని వారు కోరారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు పల్లె రమేష్, బబ్బురి స్వామి, గజ్వేల్ నియోజక వర్గ కన్వీనర్ సాయిబాబా, జిల్లా కిసాన్ సెల్ కార్యదర్శి మన్నే శ్రీనివాస్, జిల్లా మహిళ మోర్చా ఉపాధ్యక్షురాలు కట్ట భాగ్యలక్ష్మి, అనుష్, జీల్లా ఉపాధ్యక్షులు దేవుళ్ళ పల్లి మనోహర్, శేఖర్, యాదగిరి, మహిపాల్, సీనియర్ నాయకులు తిగ్గుల సాయి కిరణ్, కనకయ్య