byసూర్య | Thu, Jun 08, 2023, 12:53 PM
ఖైరతాబాద్ నియోజకవర్గం బంజర హిల్స్ లోటస్ ఫౌండ్ నందు గురువారం ఘనంగా ఊరూరు చెరువుల పండుగ కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిలుగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సోమాజిగూడ డివిజన్ కార్పొరేటర్ జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మెంబర్ మనం సంగీత శ్రీనివాస్ యాదవ్, 92- డివిజన్ వెంకటేశ్వరరావు నగర్ కాలనీ కార్పొరేటర్ మన్నే కవిత గోవర్ధన్ రెడ్డి, లైబ్రరీ చైర్మన్ ప్రసన్న, స్థానిక బి. అర్. ఎస్ పార్టీ మహిళలు, కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.