byసూర్య | Wed, Jun 07, 2023, 01:35 PM
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ కు సంబంధించిన గోడ పత్రికలను బుధవారం ఆవిష్కరించారు. ఈ ఫెస్టివల్ ఈనెల 8 వ తారీకు నుండి 3 రోజుల పాటు జిల్లా కేంద్రంలోని శిల్పారామంలో నిర్వహిస్తారన్నారు. ప్రజలు ప్రజలందరూ ఈ వేడుకలలో పాల్గొనాలన్నారు. అలాగే ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించాలని మత్స్య శాఖ అడిషనల్ డెరైక్టర్ రాధ రోహిణి కి సూచించారు.