![]() |
![]() |
byసూర్య | Wed, Jun 07, 2023, 01:51 PM
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం, వంగూరు మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలపై మండల ఎంపీడీవో విజయ భాస్కర్ ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దశాబ్ది ఉత్సవాలను ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా నిర్వహిస్తూ, ప్రజలను భాగస్వామ్యం చేసి విజయవంతం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వంగూరు సర్పంచ్ అక్కి లావణ్య ఎల్లగౌడ్, మండల పంచాయతీరాజ్ శాఖ అధికారి, వంగూరు గ్రామపంచాయతీ కార్యదర్శి, వంగూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది, అంగన్వాడి సిబ్బంది పాల్గొన్నారు.