byసూర్య | Mon, May 29, 2023, 11:15 AM
భద్రాచలం వద్ద గత ఏడాది జులైలో గోదావరి సృష్టించిన వరద బీభత్సంతో ఊర్లన్నీ ఏర్లుగా మారాయి. దారులన్నీ సముద్రాలను తలపించాయి. అప్పట్లో క్లౌడ్ బరస్ట్ తో భారీ వర్షాలు నమోదయ్యి ఈ దుస్థితి నెలకొందని తీవ్ర చర్చనీయాంశమైంది. ఇప్పుడిప్పుడే ఆ గాయం నుండి స్థానిక ప్రజలు తేరుకుంటున్నారు. మళ్లీ వర్షాకాలం సమీపిస్తుండగా అధికార యంత్రాంగం ముందస్తు జాగ్రత్త చర్యల ఊసే కనిపించకపోవడంపై ఆదివారం విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.