byసూర్య | Mon, May 29, 2023, 11:23 AM
కడ్తాల్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. దైవ దర్శనానికి వచ్చిన యువకుడు కోనేరులో గల్లంతైన సంఘటన ఆదివారం మండల పరిధిలోని మైసిగండి గ్రామంలో చోటుచేసుకుంది. హైదరాబాద్ శాలిబండ హరిబౌలిలోని ఒకే కుటుంబానికి చెందిన 15 మంది సభ్యులు మైసిగండి మైసమ్మతల్లి దర్శనానికి వచ్చారు. అమ్మవారి దర్శనం తర్వాత భోజనాల అనంతరం, మైసమ్మ ఆలయం సమీపంలోని శివాలయం ముందు ఉన్న కోనేరు వద్దకు వెళ్లారు.
అయితే ఈత కొట్టడానికి వెళ్లిన సంజయ్ (38) కోనేరు మధ్యలోకి వెళ్లగానే అదృశ్యమయ్యాడు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వెంటనే ఆలయ నిర్వాహకులకు సమాచారమిచ్చారు. ఆలయ నిర్వాహకులు అందించిన సమాచారం మేరకు కడ్తాల్ పోలీసులు, మహేశ్వరం అగ్నిమాపక సిబ్బంది కోనేరు వద్దకు చేరుకున్నారు. గజ ఈతగాళ్లు ఇనుమ చువ్వల సాయంతో కోనేరులో గాలింపు చర్యలు చేపట్టారు. అయిన సంజయ్ జాడ కనబడలేదు. ఈ ఘటనతో సంజయ్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. సోమవారం ఎన్డీఆర్ఎఫ్ బృందంతో గాలింపు చర్యలు చేపడతామని పోలీసులు తెలిపారు