కోనేరులో గల్లంతైన యువకుడు

byసూర్య | Mon, May 29, 2023, 11:23 AM

కడ్తాల్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. దైవ దర్శనానికి వచ్చిన యువకుడు కోనేరులో గల్లంతైన సంఘటన ఆదివారం మండల పరిధిలోని మైసిగండి గ్రామంలో చోటుచేసుకుంది.  హైదరాబాద్ శాలిబండ హరిబౌలిలోని ఒకే కుటుంబానికి చెందిన 15 మంది సభ్యులు మైసిగండి మైసమ్మతల్లి దర్శనానికి వచ్చారు. అమ్మవారి దర్శనం తర్వాత భోజనాల అనంతరం, మైసమ్మ ఆలయం సమీపంలోని శివాలయం ముందు ఉన్న కోనేరు వద్దకు వెళ్లారు.


అయితే ఈత కొట్టడానికి వెళ్లిన సంజయ్ (38) కోనేరు మధ్యలోకి వెళ్లగానే అదృశ్యమయ్యాడు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వెంటనే ఆలయ నిర్వాహకులకు సమాచారమిచ్చారు. ఆలయ నిర్వాహకులు అందించిన సమాచారం మేరకు కడ్తాల్ పోలీసులు, మహేశ్వరం అగ్నిమాపక సిబ్బంది కోనేరు వద్దకు చేరుకున్నారు. గజ ఈతగాళ్లు ఇనుమ చువ్వల సాయంతో కోనేరులో గాలింపు చర్యలు చేపట్టారు. అయిన సంజయ్ జాడ కనబడలేదు. ఈ ఘటనతో సంజయ్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. సోమవారం ఎన్డీఆర్ఎఫ్ బృందంతో గాలింపు చర్యలు చేపడతామని పోలీసులు తెలిపారు


Latest News
 

ఓటింగ్‌కు వెళ్లినవారికి రైల్వేశాఖ గుడ్‌న్యూస్.. తెలుగు రాష్ట్రాల మధ్య స్పెషల్ ట్రైన్, వివరాలివే Tue, May 14, 2024, 09:22 PM
తెలంగాణకు వర్ష సూచన.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ Tue, May 14, 2024, 09:15 PM
అన్ని సెగ్మెంట్లలో పెరిగిన పోలింగ్ శాతం.. కాంగ్రెస్ బలంగా ఉన్న ఆ రెండు స్థానాల్లో మాత్రం తగ్గింది Tue, May 14, 2024, 09:11 PM
తెలంగాణలో కాంగ్రెస్ పక్కాగా గెలిచే ఎంపీ స్థానాలివే.. భట్టి ఎగ్జిట్ పోల్స్ Tue, May 14, 2024, 09:06 PM
పట్నం ప్రజలకంటే పల్లె జనం నయం.. 100 శాతం పోలింగ్.. ఆదర్శంగా నిలిచిన తండా Tue, May 14, 2024, 09:01 PM