పేపర్ లీక్ ఘటనలో కీలక మలుపు... దృష్టి సారించిన ఈడీ

byసూర్య | Fri, Mar 31, 2023, 10:04 PM

తెలంగాణలో సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో  కీలక పురోగతి చోటు  చేసుకొంది. ఈ కేసుకు సంబంధించి డైరెక్టరేట్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్(ఈడీ) కూడా దృష్టి సారించింది. పేపర్ కొనుగోలులో ఆర్ధిక వ్యవహారాలు చోటుచేసుకోవడం, భారీగా ముడుపులు చేతులు మారడంతో ఈడీ రంగంలోకి దిగింది. నిందితుల మధ్య జరిగిన లావాదేవీలపై ఈడీ ఫోకస్ పెట్టింది. దీనిపై కేసు నమోదు చేసి ఈడీ దర్యాప్తు చేపట్టే అవకాశముందని తెలుస్తోంది.


మనీ లాండరింగ్ కేసు నమోదు చేసే యోచనలో ఈడీ ఉన్నట్లు సమాచారం. ఈసీఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేయాలని ఈడీ భావిస్తోంది. పేపర్ లీకేజీ వ్యవహారానికి సంబంధించి బేగంబజార్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. దీని ఆధారంగా ఈడీ కూడా త్వరలో కేసు నమోదు చేసి నగదు లావాదేవీలపై విచారణ చేపట్టనుంది. ప్రశ్నాపత్రాల విక్రయం ద్వారా లక్షల్లో డబ్బులు చేతులు మారినట్లు ఇప్పటికే సిట్ పోలీసుల విచారణలో తేలింది. ఒక్కొ పేపర్‌కు రూ.10 నుంచి రూ.15 లక్షల వరకు తీసుకున్నట్లు గుర్తించారు.


దీంతో లావాదేవీలపై వ్యవహారంపై ఈడీ మరింత లోతుగా విచారణ చేపట్టే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ప్రవీణ్ కుమార్, రాజశేఖర్ రెడ్డి, డాక్యతోపాటు ఇతర నిందితులు లక్షల్లో డబ్బులు తీసుకున్నట్లు ఈడీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఏఈ క్వశ్చన్ పేపర్ కోసం ఏకంగా రూ.25 లక్షలు చేతులు మారినట్లు తేలింది. అయితే ఈ కేసులో ఈడీ మరో కొత్త కోణంపై దృష్టి పెట్టింది. హవాలా మార్గంలో నగదు చేతులు మారినట్లు ఈడీ అనుమానిస్తున్నట్లు సమాచారం.


ఈ క్రమంలో పీఎంఎల్ఏ చట్టం క్రింద ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనుందని చెబుతున్నారు. త్వరలోనే సిట్ అధికారుల నుంచి ఈ కేసు వివరాలను ఈడీ కోరే అవకాశముంది. అలాగే ఎఫ్‌ఐఆర్‌ను పరిశీలించడంతో పాటు నిందితులను ప్రశ్నించే అవకాశముంది. కేవలం డబ్బుల వ్యవహారానికి సంబంధించి మాత్రమే ఈడీ దర్యాప్తు చేపడుతుంది. నిందితులకు డబ్బులు ఎక్కడ నుంచి వచ్చాయి? ఎలా ట్రాన్స్‌ఫర్ చేశారు? అనే వివరాలను సేకరించనుంది. ఇప్పటికే ఈ కేసులో 15 మందిని సిట్ అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకుంది. మరిన్ని వివరాల కోసం వారిని ఆరా తీస్తోంది. దీంతో ఈ కేసులో రోజుకో ట్విస్ట్ బయటపడుతుంది. ఇప్పుడు ఈడీ ఎంట్రీతో ఈ కేసులో ఎలాంటి మలుపులు చోటుచేసుకుంటాయనేది సస్పెన్స్‌గా మారింది. మరి ఈడీ దర్యాప్తులో ఎలాంటి విషయాలు బయటపడతాయో చూడాలి.



Latest News
 

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న మధ్యం ధరలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ధ్వజమెత్తారు Sun, May 18, 2025, 08:53 PM
మైలార్‌దేవ్‌పల్లిలో మూడంతస్తుల భవనంలో చెలరేగిన మంటలు Sun, May 18, 2025, 08:34 PM
మరో నెలపాటు ధాన్యం కొనుగోళ్లు Sun, May 18, 2025, 07:41 PM
అధికారంలోకి రాగానే అడ్డగోలుగా మద్యం ధరల పెంపు.. హరీశ్ రావు ఆగ్రహం Sun, May 18, 2025, 07:38 PM
ప్రమాద బాధితులకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన కేంద్రం Sun, May 18, 2025, 07:38 PM