క్షణికావేశంలో ప్రాణాలను తీసుకొంటున్న యువత

byసూర్య | Wed, Mar 29, 2023, 06:57 PM

క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలతో తమ విలువైన జీవితాలను యువత కూల్చేసుకొంటోంది. పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చాయనో.. నాన్న తిట్టాడనో.. అమ్మ ఫోన్ కొనివ్వలేదనో.. ఇలా చిన్న చిన్న విషయాలకే ఎంతో విలువైన తమ ప్రాణాలను తీసుకుంటున్నారు. అలాంటి ఘటనే కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్‌ మండలం కదంబాపూర్‌లో చోటు చేసుకుంది. పొరుగుంటి వారు తిట్టారని ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది.


పోలీసులు, మృతురాలి కుటుంబ సభ్యుల తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బొంకూరి శైలజ(30) కుటుంబానికి పొరుగింట్లో ఉండే కూకట్ల కూమార్ కుటుంబానికి ఓ స్థలం విషయమై గొడవలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో పది రోజుల క్రితం శైలజను కూకట్ల కుమార్‌, అతడి కుటుంబ సభ్యులు సంతోష్, రాకేశ్, విజయ్‌కుమార్‌ స్వరూప దూషించారు. దీంతో ఆమె మానసిక వేదనకు గురైంది. అప్పట్నుంచి ఇంట్లోవాళ్లతోనూ సరిగా మాట్లాడటం లేదు.


ఈ క్రమంలో మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో శైలజ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను కిందకు దింపి చూడగా అప్పటికే మృతి చెందింది. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. మృతురాలు శైలజకు భర్త శ్రీనివాస్‌తో పాటు ఇద్దరు పిల్లలున్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కుమార్‌తో పాటు అతడి కుటుంబంలోని నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


మరో ఘటనలో చేతి ఉంగరం పోయిందని ఓ డిగ్రీ విద్యార్థిని ప్రాణాలు తీసుకుంది. ఈ విషాదకర ఘటన మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మడలం గున్నేపల్లిలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన హేమలతారెడ్డి హనుమకొండలోని ఓ ప్రైవేటు కాలేజీలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతోంది. ఉగాది పండుగను పురస్కరించుకొని ఈనెల ఈ నెల 20న ఇంటికి వచ్చింది. ఇంటికొచ్చిన తర్వాత తన చేతికి ఉన్న బంగారు ఉంగరాన్ని పొగొట్టుకుంది. అన్నిచోట్లా వెతికినా.. ఎక్కడా ఉంగరం కనిపించలేదు.


అయితే ఆరు నెలల క్రితమే హేమలతారెడ్డి తన బంగారు గొలుసును పోగొట్టుకుంది. ఇప్పుడు ఉంగరం కూడా ఎక్కడో పోటవటంతో ఆమె మనోవేదనకు గురైంది. తల్లిదండ్రులకు విషయం చెబితే మందలిస్తారేమోననే భయంతో ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. 'నాన్న నన్ను క్షమించు.. సారీ డాడీ. నాకు భయమేస్తోంది' అంటూ ఆత్మహత్యకు ముందు సూసైడ్ లెటర్‌ రాసి ప్రాణాలు తీసుకుంది. ఇలా చిన్న చిన్న కారణాలకే ప్రాణాలు తీసుకోవటం కాలవరపాటుకు గురి చేస్తుంది. ఎంతో విలువైన ప్రాణాలను ఎవరో తిట్టారని.. ఏదో పోయిందని.. ఇలా బలవన్మరణానికి పాల్పడటమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.



Latest News
 

పీసీసీపదవికి రేవంత్ రెడ్డి రాజీనామా.. టీ కాంగ్రెస్‌కు త్వరలో కొత్త అధ్యక్షుడు Fri, May 17, 2024, 09:16 PM
ఆపరేషన్ 'కరెంట్' షురూ చేసిన రేవంత్ సర్కార్.. రంగంలోకి కమిషన్.. బహిరంగ ప్రకటన Fri, May 17, 2024, 09:12 PM
వాళ్ల పేర్లు చెప్పాలని జైల్లో ఒత్తిడి తెస్తున్నారని కవిత చెప్పారు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ Fri, May 17, 2024, 09:08 PM
కేఏ పాల్‌పై చీటింగ్ కేసు.. ఎమ్మెల్యే టికెట్ కోసం 50 లక్షలు తీసుకున్నట్టు ఫిర్యాదు Fri, May 17, 2024, 09:04 PM
అమెరికాలో తెలుగు యువకుడి మృతి.. రోడ్డు ప్రమాదం నుంచి బయటపడి, ఆ వెంటనే కారు ఢీకొట్టి Fri, May 17, 2024, 09:00 PM