భద్రాద్రి రాములోరి తలంబ్రాలకు అనూహ్య స్పందన,,,పది రోజుల్లోనే 50 వేల బుకింగ్‌లు

byసూర్య | Wed, Mar 29, 2023, 06:59 PM

భద్రాద్రి రాములోరి తలంబ్రాలకు భక్తుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. ఇదిలావుంటే శ్రీరామ నవమి సందర్భంగా భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణం ఈనెల 30న జరగనుంది. నియమ నిష్టలతో ధాన్యాన్ని గోటితో ఒలిచి తీసిన కోటి బియ్యం గింజలను తలంబ్రాలుగా భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణోత్సవంలో ఉపయోగిస్తున్నారు. విశిష్టమైన ఆ తలంబ్రాలను భక్తులు పొందేందుకు ఆసక్తి చూపిస్తారు. ఈ నేపథ్యంలో కల్యాణ తలంబ్రాలను భక్తులకు అందజేయాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా రూ.116 చెల్లించి బుక్‌ చేసుకుంటే కల్యాణం అనంతరం తలంబ్రాలను భక్తులకు హోం డెలివరీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే భద్రాద్రి రాములోరి తలంబ్రాలకు అనూహ్య స్పందన లభించింది. కేవలం పది రోజుల్లోనే 50 వేల మంది భక్తులు తలంబ్రాల కోసం ఆన్‌లైన్‌ బుకింగ్‌ చేసుకున్నారు. రోజుకు సగటున 5 వేల వరకు బుకింగ్‌లు అవుతున్నాయి. ఈ మేరకు టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఓ ప్రకటన విడుదల చేశారు.


టీఎస్‌ఆర్టీసీ భక్తులకు మరో అవకాశాన్ని కల్పించింది. శ్రీరామ నవమి కల్యాణ సమయంలోనే కాకుండా.. తలంబ్రాలను ఎప్పుడైనా భక్తులు పొందే సదావకాశాన్ని కల్పించింది. కార్గో పార్శిల్‌ సెంటర్‌కు వెళ్లి రూ.116 చెల్లిస్తే.. నిర్ణీత సమయంలో తలంబ్రాలను భక్తులకు అందించనుంది. రాష్ట్రంలోని అన్ని టీఎస్‌ఆర్టీసీ కార్గో పార్శిల్‌ కౌంటర్లలో తలంబ్రాలను బుక్‌ చేసుకోవచ్చని ఆర్టీసీ అధికారులు సూచిస్తున్నారు. ఈ సేవలను పొందాలనుకునే భక్తులు. టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్‌ విభాగ ఫోన్‌ నంబర్లు 9177683134, 9154680020, 7382924900ను సంప్రదించాలన్నారు. సంస్థకు చెందిన మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌లు భక్తుల వద్ద కూడా ఆర్డర్లు స్వీకరిస్తారని తెలిపారు.


శ్రీరామనవమి సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త వినిపించారు. ఈనెల 30న భధ్రాచలంలో జరుగనున్న రాములోరి కళ్యాణ మహోత్సవాల నిర్వహణ కోసం ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి నుంచి కోటి రూపాయలు మంజూరు చేశారు. ఈ నిధులతో సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. మరోవైపు భద్రాద్రి రాములోరి కళ్యాణం వీక్షించడానికి లక్ష మందిపైగా భక్తులు తరలి వచ్చే అవకాశం ఉన్నట్లు ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. అందులో భాగంగా రెండు లక్షల లడ్డు ప్రసాదాలు సిద్ధం చేస్తున్నారు. 80 కౌంటర్ల ద్వారా తలంబ్రాలు, లడ్డు ప్రసాదం పంపిణీ చేయనున్నారు. గతంలో బూజు పట్టిన లడ్డు ప్రసాదాలను భక్తులకు విక్రయించటం విమర్శలకు దారి తీసింది. ఈ నేపథ్యంలో ఈసారి అలాంటి పొరపాట్లు జరగకుండా నాణ్యతతో కూడిన లడ్దు ప్రసాదాలను అధికారులు సిద్ధం చేస్తున్నారు.



Latest News
 

ఈ తేదీ నుండి మనకి భారీ వర్షాలు! Sat, May 04, 2024, 11:14 AM
నేడు కొత్తకోటకు సీఎం రేవంత్ రెడ్డి రాక Sat, May 04, 2024, 10:49 AM
తెలంగాణకు కేసీఆర్ శ్రీరామ రక్ష: హరీశ్ రావు Sat, May 04, 2024, 10:47 AM
పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును వినియోగించుకోవాలి: కలెక్టర్ Sat, May 04, 2024, 10:18 AM
ఎవ‌రీ వేముల రోహిత్‌..? Sat, May 04, 2024, 10:09 AM