byసూర్య | Sat, May 04, 2024, 10:18 AM
మే 4 నుండి మే 6 వరకు పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును ఎలక్షన్ డ్యూటీ లో ఉన్న ఉద్యోగులందరూ సద్వినియోగం చేసుకోవాలని భద్రాద్రి జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ప్రియాంక అలా శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎవరైతే పోస్టల్ బ్యాలెట్ కొరకు దరఖాస్తు చేసి ఉన్నారో వారు నియోజకవర్గ కేంద్రాల లో ఏర్పాటుచేసిన ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ నందు ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.