byసూర్య | Sat, May 04, 2024, 10:09 AM
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్డీ ఫిజిక్స్ చదివిన విద్యార్ధి వేముల రోహిత్. 2015లో హెచ్సీయూలోని ఏబీవీపీ విద్యార్ధులపై రోహిత్ తోపాటు ఐదుగురు దళిత విద్యార్ధులు దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ ఐదుగురు విద్యార్ధులను హాస్టల్ నుంచి సస్పెండ్ చేశారు. అంతేకాకుండా ప్రతినెలా వచ్చే రూ.25వేల స్కాలర్షిప్ను నిలిపివేశారు. దీంతో విసిగిపోయిన రోహిత్ 2016 జనవరి 17న స్నేహితుడి గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు.