byసూర్య | Tue, Mar 28, 2023, 01:42 PM
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారిని మంగళవారం బలగం సినిమా దర్శకుడు ఎల్దండి వేణు దర్శించుకున్నారు. ముందుగా స్వామివారికి ఇష్టమైన కోడె మొక్కు చెల్లించుకున్నారు. అనంతరం నాగిరెడ్డి మండపంలో అర్చకులు వేదోక్త ఆశీర్వచనం చేయగా ఏఈవో బి. శ్రీనివాస్ లడ్డు ప్రసాదం అందజేశారు. దర్శకుడు వేణుకు రాజన్న ఆలయ ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షుడు సిరిగిరి శ్రీరాములు, టీఎన్జీఓ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉపాధ్యాయుల చంద్ర శేఖర్ శాలువతో సత్కరించారు.