byసూర్య | Sun, Mar 26, 2023, 12:50 PM
రాష్ట్ర మాజీ మంత్రి హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కు సంగారెడ్డి జిల్లా బిజెపి నాయకులు ఆదివారం ఉదయం ఘన స్వాగతం పలికారు. కర్ణాటక రాష్ట్రం బసవ కళ్యాణి పట్టణంలో ఆదివారం మధ్యాహ్నం నిర్వహించ తలపెట్టిన భారతీయ జనతా పార్టీ భారీ బహిరంగ సభకు వెళుతున్న భాజపా రాష్ట్ర అగ్ర నేతల కు బిజెపి సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నరేందర్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి సుధీర్ కుమార్, జహీరాబాద్ శాసనసభ నియోజకవర్గ బిజెపి ఇన్చార్జి రామచందర్ రాజనర్సింహ తదితర నాయకులు సంగారెడ్డిలో ఘన స్వాగతం పలికారు.