కాంగ్రెస్ లోకి డీఎస్ రీఎంట్రీ

byసూర్య | Sun, Mar 26, 2023, 01:09 PM

సీనియర్ పొలిటీషియన్ డీఎస్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ లో రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఆరోగ్యం సహకరించకపోయినా వీల్ ఛైర్ లో గాంధీ భవన్ కు చేరుకున్నారు. దీనికి ముందు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. డీఎస్ తో పాటుగా ఆయన కుమారుడు సంజయ్ ఈ రోజు కాంగ్రెస్ లో చేరుతున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే, డీఎస్ పేరుతో ఒక లేఖ విడుదల అయింది. తన కుమారులు ఇద్దరు ఒకరు కాంగ్రెస్ లో..మరొకరు బీజేపీలో తెలంగాణ కోసం పని చేస్తున్నారని..తాను మాత్రం కాంగ్రెస్ లో చేరటం లేదనేది లేఖ సారాంశం. కానీ, నిమిషాల్లో సీన్ మారిపోయింది.

డీ శ్రీనివాస్ తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ నేత. కాంగ్రెస్ లో సుదీర్ఘ కాలం అనేక హోదాల్లో పని చేసారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడిగా వ్యవహరించారు. వైఎస్సార్ తో కలిసి 2004, 2009 లో కాంగ్రెస్ అధికారంలోకి రావటంలో కీలక పాత్ర పోషించారు. రాష్ట్ర విభజన తరువాత ఆయన మారిన రాజకీయ సమీకరణాల్లో నాటి టీఆర్ఎస్ లో చేరారు. రాజ్యసభ సభ్యుడు అయ్యారు. కానీ, టీఆర్ఎస్ లో డీఎస్ కొంత కాలానికే దూరమయ్యారు. ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సమయంలోనే రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాతో సమావేవమయ్యారు. అప్పట్లోనే కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారం సాగింది.

Latest News
 

సమ్మర్ క్యాంప్ ద్వారా సరైన గైడెన్స్ అందించాలి: కలెక్టర్ Thu, Mar 28, 2024, 01:46 PM
మాతృ మరణాల నివారణకు పటిష్ట చర్యలు Thu, Mar 28, 2024, 01:43 PM
జైరాబాద్ బిజెపి పార్లమెంట్ అభ్యర్థి పర్యటన Thu, Mar 28, 2024, 01:41 PM
అల్లాపూర్ గ్రామంలో ఇప్పటికీ తీరని నీటి కష్టాలు Thu, Mar 28, 2024, 01:38 PM
గాయత్రి మాతను దర్శించుకున్న ఎమ్మెల్సీ Thu, Mar 28, 2024, 01:37 PM