కిన్నెరసానిలో పర్యటకుల సందడి
byసూర్య |
Mon, Mar 20, 2023, 11:32 AM
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల పరిధిలోని కిన్నెరసాని అలాశయంలో ఆదివారం పర్యాటకుల బోటు షికారు చేశారు. సందర్శకులతో ప్రాజెక్టు పరిసరాల్లో కోలాహలం నెలకొంది. పర్యాటకులు డీర్ పార్కులోని దుప్పులను, డ్యామ్ పైనుంచి జలాశయాన్ని వీక్షించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అనందోత్సాహాల నడుమ గడిపారు. 387 మంది పర్యాటకులు తరలిరాగా తద్వారా వైల్డ్ లైఫ్ శాఖకు రూ. 13, 665 ఆదాయం లభించింది. 200 మంది బోటు షికారు చేయగా టూరిజం కార్పొరేషన్ కు రూ. 12180 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు.
Latest News