ఎమ్మెల్యే గణేష్ గుప్తాకు తప్పిన ప్రమాదం

byసూర్య | Mon, Mar 20, 2023, 11:31 AM

నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తకు పెను ప్రమాదం తప్పింది. నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఎమ్మెల్యే కాన్వాయ్ మధ్యకు ఓ ప్రైవేట్ వాహనం రావడంతో ఆదివారం సాయంత్రం ప్రమాదం జరిగింది. కాన్వాయ్ కామారెడ్డి పట్టణంలోని సిరిసిల్ల రోడ్డులో జాతీయ రహదారి ఫ్లైఓవర్ వద్దకు రాగానే ఢిల్లీ నుంచి కేరళ వైపు వెళ్తున్న వాహనం ఎమ్మెల్యే వాహనం వెనక్కు వచ్చింది. ఆ కారు వేగం నెమ్మదించడంతో వెనకాల ఉన్న ఎమ్మెల్యే కాన్వాయ్ వాహనం ఢిల్లీ కారును ఢీకొనగా అది ఎమ్మెల్యే కారును ఢీ కొట్టింది. ఇలా నాలుగు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. వెంటనే వాహనాల్లోని ఏర్ బ్యాగులు తెరుచుకున్నాయి. ఈ సంఘటనలో ఎవరికి గాయాలు కాలేదు. నాలుగు వాహనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఎవరికి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ మేరకు కామారెడ్డి పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.


Latest News
 

పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉండదు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి Thu, Apr 18, 2024, 11:10 PM
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు Thu, Apr 18, 2024, 10:25 PM
ఫస్ట్ అటెంప్ట్‌లోనే సివిల్స్ థర్డ్ ర్యాంక్.. సత్తా చాటిన తెలంగాణ యువతి Thu, Apr 18, 2024, 09:08 PM
ఆ రోజు ఫ్లైట్‌లో జరిగింది ఇదే.. విమానంలో వాటర్ బాటిళ్లు పంచటంపై మాధవీలత వివరణ Thu, Apr 18, 2024, 09:03 PM
50 బహిరంగ సభలు, 15 రోడ్‌ షోలు.. గేరు మార్చనున్న సీఎం రేవంత్ రెడ్డి Thu, Apr 18, 2024, 08:59 PM