పరీక్ష పత్రాల లీకేజీలో కేటీఆర్ పిఏ: పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

byసూర్య | Sun, Mar 19, 2023, 10:26 AM

టి ఎస్ పి ఎస్ సీ పరీక్ష పత్రాల లీకేజీలో మంత్రి కేటీఆర్ పిఏ తిరుపతికి భాగస్వామ్యం ఉందని, ఆయన ద్వారా సిరిసిల్ల జిల్లా మల్యాల మండలానికి చెందిన 100 మందికి వందకు పైగా మార్కులు వచ్చినట్టు తమకు సమాచారం ఉందని పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆరోపించారు. మంత్రి కేటీఆర్ ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. హాద్ సే హాద్ జోడో యాత్రలో భాగంగా శనివారం కామారెడ్డి జిల్లా రాజంపేట కార్నర్ మీటింగ్, కామారెడ్డిలో జరిగిన విలేకరుల సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. సిబిఐ పై నమ్మకం లేకుంటే సిట్టింగ్ జడ్జి చేత ఈ వ్యవహారం పై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. లీకేజీలో మంత్రి కార్యాలయానికి సంబంధం ఉండడం వల్లే విచారణ జరగకుండా చూస్తున్నారని ఆరోపించారు. లీకేజీ వ్యవహారంలో 9 మందిని అరెస్టు చేస్తే కేటీఆర్ మాత్రం ఇద్దరే దొంగలు అన్నట్లు చెప్పడంలో మతలబు ఏమిటని ప్రశ్నించారు. ప్రశ్న పత్రాల లీకేజీలో చిన్న చేపలను బలి చేసి, చైర్మన్, బోర్డు మెంబర్లు, సీఎం కేసీఆర్, కేటీఆర్ తప్పించుకుంటున్నారని దుయ్యబట్టారు.


Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM